నెన్నెల, ఏప్రిల్ 27 : వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని సమీపంలోని అడవికి వెళ్లాడు. రాత్రి అయినా రామయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అడవిలో గాలించగా ఆదివారం వాగు వద్ద నిర్జీవంగా కనిపించాడు.
ఎండకు తట్టుకోలేక నీటికోసం వాగువెంట తిరిగి స్పృహతప్పి మరణించి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై తెలిపారు.