చండ్రుగొండ, జన వరి 17 : విద్యుత్తు షాక్ తో రైతుమృతి చెందిన ఘ టన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రావికంపాడు గ్రామానికి చెందిన రైతు కుక్కుల శ్రీనివాసరావు (50) కరెంటు మోటర్తో నీరు పెట్టేందుకు బుధవా రం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్తు స్తంభానికి గల సపోర్టింగ్ వైరు తెగి ఉండటాన్ని గమనించాడు. దానిని పొలం గట్టుపై వేసేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించగా దానికి కరెంటు సరఫరా కావడంతో షాక్ తగి లి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మాచినేని రవి తెలిపారు.