మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 1 : మోటర్ నడవకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్లో సోమవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్కు చెందిన రైతు పిట్టల సంపత్ (35) కౌలుకు చేస్తున్న పొలం వద్ద మోటర్ నడవకపోవడంతోసమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను ఆన్ ఆఫ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు సంపత్ను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజ్కుమార్ తెలిపారు.