బోథ్, డిసెంబర్ 27: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నేరేడుపల్లెకు చెందిన కౌలు రైతు ఆత్రం శ్రీనివాస్ (23) పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసా యం చేస్తున్నాడు. వేసిన పత్తి పంట ఆశించి న దిగుబడి రాకపోవడంతో రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యు లు బోథ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. సోదరుడు ఆత్రం భీం రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాము తెలిపారు.