హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకొనే క్రిస్మస్ వేడుకులకు చర్చిలన్నీ ముస్తాబయ్యాయి. ప్రఖ్యాత మెదక్ చర్చితోపాటు, రాష్ట్రంలోని ప్రముఖ చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రతియేటా మాదిరిగానే క్రిస్మస్ను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రూ.33 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను అందజేసింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో విందు ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు.
మంత్రుల శుభాకాంక్షలు
ప్రేమ, సేవాతత్పరత, క్షమాగుణాన్ని మానవాళికి బోధించిన ఏసుప్రభువు జన్మదినం క్రైస్తవులందరికీ పర్వదినమని మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.