నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని జానకంపేటలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గ్రామానికి చెందిన రేఖ, సాయిలు భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు చరణ్, అరుణ్లు ఉన్నారు. అయితే బుధవారం రాత్రి అంతాకలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
గమనించిన స్థానుకులు వారిని నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాయిలు మృతిచెందాడు. భార రేఖ పరిస్థితి విషమంగా ఉందని, చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.