హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ మెయిల్ను సృష్టించారు. మెయిల్ ఆధారంగా పౌర సరఫరాలు, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటనలు జారీ చేశారు. ఈ నకిలీ మెయిల్ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ విభాగానికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టీఎస్పీఎస్సీ అధికార వెబ్సైట్ నుంచి కాకుండా నకిలీ ఈ మెయిల్ ద్వారా ప్రకటన వచ్చినట్లు గుర్తించారు. విషయంపై టీఎస్పీఎస్సీ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ మెయిల్స్ పట్ల ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్పీఎస్సీ అధికారులు సూచించారు. ఎలాంటి ప్రకటనైనా అధికార వెబ్సైట్ నుంచే విడుదల అవుతుందని తెలిపారు.