హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పదవీ కాలాన్ని మరో 2 ఏండ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.