హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీపై నమోదైన కేసుల్లో భాగంగా బ్రహ్మయ్య అండ్ కో ఆడిట్ కంపెనీలో ఏపీ సీఐడీ సోదాలు, సామాగ్రి, రికార్డుల స్వాధీనానికి సంబంధించి యథాతథస్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలంటూ మార్చి 29న ఇచ్చిన ఉత్తర్వులను ఏప్రిల్ 13 వరకు పొడిగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మయ్య అండ్ కో కంపెనీతోపాటు హైదరాబాద్లోని తమ కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని మార్గదర్శి వేసిన కేసులన్నింటినీ కలిపి హైకోర్టు శుక్రవారం విచారించింది. 7 డెస్క్టాప్లు, 12 ల్యాప్టాప్లు, 2 హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని పోలీసులు కాపీ చేసుకుని వెళ్లారని, వినియోగదారుల వివరాలను కూడా తీసుకుని పంచనామా కాపీ ఇవ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గోవింద్రెడ్డి స్పంది స్తూ.. పోలీసులు మార్గదర్శికి చెందిన సమాచారాన్ని మాత్రమే తీసుకెళ్లారని తెలిపారు. చిట్స్ ద్వారా వచ్చిన సొమ్మును మార్గదర్శి సంస్థ షేర్ మారెట్కు, మ్యూచువల్ ఫండ్స్కు మళ్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయని హైకోర్టుకు వివరించడంతో తదుపరి విచారణ 13కు వాయిదా పడింది.