వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 7 : ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది.
పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కలిసి.. రిపోర్టింగ్ గడువు పొడిగిం చాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో విడత కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వర్సిటీ తెలిపింది.