హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): రేషన్కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పొడగించింది. వచ్చే ఫిబ్రవరి నెల చివరి వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెలఖారుతో గడువు ముగియనున్నది. అయితే ఇంకా లబ్ధిదారులు కేవైసీ చేసుకోకపోవడంతో గడువు పెంచింది.