హైదరాబాద్, మార్చి6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 16కు పొడిగించినట్టు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు. దరఖాస్తు నమోదు, ఇతర వివరాలకు www.tgcet.cgg.gov.in, www.tswries. ac.in <http://www.tswries. ac.in, 1800 425 45678 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఏప్రిల్ 23న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
6,7,8,9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6,7,8,9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 13 వరకు పొడిగించామని రోనాల్డ్ రాస్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని ఎస్సీ గురుకుల (సీవోఈ)లో 9వ తరగతిలో, వికారాబాద్ జిల్లా పరిగి, ఖమ్మంలోని ఎస్టీ గురుకుల (సీవోఈ)లో 8వ తరగతిలో ఖాళీ సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు.