హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ దరఖాస్తుల గడువును ఏఐసీటీఈ పొడిగించింది. 2024-25 విద్యాసంవత్సరంలో ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 7 వరకు, ఆలస్య రుసుముతో అదేనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్కుమార్ తెలిపారు. బీబీఏ, బీఎంఎస్, బీసీఏ కోర్సులను కొత్తగా నిర్వహించే కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఫిబ్రవరి 26లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పైకోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు ఇంజినీరింగ్ కాలేజీల షెడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.