హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో 12 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అహ్మదాబాద్-తిరుచిరాపల్లి( Ahmedabad-Tiruchirappalli) , విశాఖపట్నం-కర్నూల్టౌన్, భువనేశ్వర్-తిరుపతి, షోలాపూర్-ఎల్టీటీ ముంబాయి, షోలాపూర్-తిరుపతి, పూనే-అమరావతి వంటి రైల్వే స్టేషన్ల పరిధిలో రైళ్ల పొడిగింపు ఉంటుందని వివరించారు. ఈ నెల 28 నుంచి జనవరి 29 వరకు టైంటేబుల్ వారీగా ప్రత్యేక రైళ్ల రాకపోకల పొడిగింపు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
నాలుగు రైల్వే స్టేషన్ల పరిధిలో నాలుగు రైళ్ల పునరుద్ధరణ
కన్యాకుమారి-నిజాముద్ధీన్, హిసర్-తిరుపతి రైల్వే స్టేషన్ల పరిధిలో మొత్తం నాలుగు రైళ్లను పునరుద్ధరిస్తున్నామని అధికారులు వివరించారు. వీటిలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో విడుదల చేసిన టైం టేబుల్ తేదీల ప్రకారం రైళ్ల పునరుద్ధరణ ఉంటుందన్నారు.