హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): యంత్రంతో పత్తి తీసే ప్రయోగం విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో సాగు చేస్తున్న పత్తిని గురువారం యంత్రంతో ఏరే ప్రయోగం నిర్వహించారు. గత ఏడాది నుంచి యూనివర్సిటీలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
కోతకు వచ్చిన పత్తిని యంత్రంతో తీసే ప్రయోగం నిర్వహించారు. తొలిదశ ప్రయో గం విజయవంతమైందని వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఎదురైన పలు సమస్యలను పరిష్కరించి మరింత మెరుగైన విధానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రయోగం వర్సిటీకి మాత్రమే పరిమితమైంది.