హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తూ పట్టుబడిన ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిపై తొలిసారి పీడీయాక్టు కేసు నమోదు చేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. రవీంద్రభారతిలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఝార్ఖండ్కు చెందిన రాజారామ్సింగ్ నుంచి 339 బాటిళ్ల హర్యానా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై ఇకనుంచి పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ను మంత్రి అభినందించారు.