హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డు అందుకున్నది. ఆ సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం కూడా ఉత్తమ డైరెక్టర్, కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును దక్కించుకున్నారు. అత్యుత్తమ ఖనిజ కంపెనీలు, అధికారులను జియో మైన్టెక్ సంస్థ ఏటా గుర్తిస్తున్నది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో గురువారం నిర్వహించిన నేషనల్ టెక్నాలజీ డే వేడుకలో ఈ అవార్డులను అందజేసింది. ఒడిశా పర్యావరణ శాఖ మంత్రి ప్రదీప్కుమార్ అమత్ ఈ అవార్డులను సింగరేణి సంస్థ తరఫున హాజరైన జీఎం బీహెచ్ వెంకటేశ్వర్లు, ఏజీఎం మజుందార్, ఎస్ఈ రాజశేఖర్కు అందించారు.
అవార్డులు ఎందుకు దక్కాయంటే..
-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన అత్యుత్తమ బొగ్గు ఉత్పత్తి, రవాణా, సీఎస్ఆర్ కార్యక్రమాలు, పర్యావరణ చర్యలకు గుర్తింపుగా జియో మైన్టెక్ సంస్థ ‘గోల్డెన్ రెయిన్బో’ అవార్డును ప్రకటించింది. పర్యావరణ, అటవీ విభాగాల్లో అందిస్తున్న సేవలకుగాను సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంకు బెస్ట్ డైరెక్టర్, కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును అందజేసింది. వన ప్రేమికుడైన బలరాం సొంతంగా 15 వేల మొక్కలు నాటారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహించారు. సింగరేణి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను కార్పొరేట్ శాలరీ అకౌంట్లుగా మార్పించి ప్రమాద బీమా సౌకర్యం బ్యాంకుల ద్వారా వర్తించేలా చొరవ చూపారు.