హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : భూగర్భ జలశాఖలో 25 నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి గురు, శుక్రవారాల్లో పరీక్ష జరగనున్నది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు.