శంషాబాద్ రూరల్/హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణిని పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్తున్న ఆమెను శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని, ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. గతంలో రాజస్థాన్లోని జైపూర్లో రోడ్డు కాంట్రాక్టు పనులు చేసిన శ్రీవాణి.. కపిల్సింగ్ అనే వ్యకి భూమిలో అనుమ తి లేకుండా మట్టి తవ్వారని, భూమి యజమాని ఫిర్యాదు మేరకు 2016లో శ్రీవాణిపై కేసు నమోదైందని ఎస్సై సుమన్ వివరించా రు. ఈ కేసులో శ్రీవాణి కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజస్థాన్ పోలీసులు లుకౌట్ నోటీసు జారీచేశారు. దుబాయ్ వెళ్లేందుకు గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమెను శుక్రవారం ఉదయం అరెస్టుచేసి, రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. శంషాబాద్కు వచ్చిన రాజస్థాన్ పోలీసులు స్థానిక ప్రభుత్వ దవాఖానలో శ్రీవాణికి వైద్యపరీక్షలు చేయించి రాజేంద్రనగర్ కోర్టుకు తరలించినట్టు చెప్పారు. కాగా, రాజస్థాన్లోని సదరు భూమి యజమానికి డబ్బు చెల్లించానని, అయినా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు.