పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. పాలకుర్తి మండలం రామారావుపల్లి మాజీ ఎంపీటీసీ దంపతులను అత్యంత దారుణంగా చంపారు. దంపతులు వెంకటి, కనకలక్ష్మిని గొడ్డలితో నరికి చంపారు. భూతగాదాల వల్లే హత్య జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రామారావుపల్లిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.