Neeraj Chopra : ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో టోర్నీకి సిద్ధమవుతున్నాడు. గ్లాస్గోలో రెండో స్థానంతో సరిపెట్టుకున్న భారత బడిసె వీరుడు ఈసారి లసానే డైమండ్ లీగ్లో పాల్గొంటున్నాడు. అథ్లెటిస్సిమాగానే పిలిచే ఈ ఈవెంట్ ఆగస్టు 21, శుక్రవారం నుంచి మొదలవ్వనుంది.
ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈమధ్యే కామన్వెల్త్ క్రీడల్లో వెండి వెలుగులు విరజిమ్మిన అతడు.. లసానే డైమండ్ లీగ్లోనూ అదరగొట్టాలని భావిస్తున్నాడు. ఈ వేదికపై రికార్డు మెరుగ్గా ఉండడంతో మనోడే ఫేవరెట్. అయితే.. ఇక్కడ కూడా భారత అథ్లెట్కు శ్రీలంక స్టార్ రుమేశ్ థరంగ పథిరంగే, అర్షద్ నదీమ్(పాకిస్థాన్)లు సవాల్ విసరనున్నారు.
NEERAJ CHOPRA IN THE HUNT! 🇮🇳
The men’s javelin competition is heating up as the race to the 2026 Diamond League enters its decisive phase.
With Rumesh Pathirage, Anderson Peters, Curtis Thompson, Keshorn Walcott and more in the mix, Neeraj Chopra faces a stacked field in the… pic.twitter.com/aTuc6mhlHi
— IndiaSportsHub (@IndiaSportsHub) August 20, 2026
కామన్వెల్త్లో నీరజ్ 85.83 మీటర్లకే పరిమితమవ్వగా.. రుమేశ్ ఏకంగా 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడిని పట్టేశాడు. ఇక ఫౌల్ కారణంగా నదీమ్ పతకం గెలవలేదు. సో.. లసానే డైమండ్ లీగ్లో.. ఈ ఇద్దరు నీరజ్కు గట్టి పోటీదారులుగా మారారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ ఖెషోర్న్ వాల్కాట్ కూడా పతకం గెలవగల సమర్ధుడే. ప్రపంచ అథ్లెటిక్స్ ముందు జరుగుతున్న ఈ టోర్నీ అయినందున.. నీరజ్ చోప్రా అంచనాలకు తగ్గట్టు రాణించాలని భావిస్తున్నాడు. 2022, 2023లో ఇక్కడ విజేతగా నిలిచిన నీరజ్.. 2024లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరి, ఈసారి ఏం చేస్తాడో చూడాలి.