హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు ఉండటంతో వినోద్ కుమార్ కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది.
తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని వినోద్ కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని పేర్కొన్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని వినోద్ కుమార్ సూచించారు.