వికారాబాద్/హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్రెడ్డికి కన్నీటి వీ డ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శనివారం హరీశ్వర్రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్వర్రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. హరీశ్వర్రెడ్డి భౌతికకాయానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు మంత్రులు కే తారక రామారావు, హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే లు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పైలట్ రోహిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి తదితరులు నివాళులర్పించారు.
మంత్రులు కేటీఆర్, హరీశ్రావు.. హరీశ్వర్రెడ్డి తనయుడు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితోపాటు వారి కుటుం బ సభ్యులను ఓదార్చారు. హరీశ్వర్రెడ్డి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని, అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హరీశ్వర్రెడ్డి మృతిపట్ల మంత్రులు మ హమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, సత్యవతిరాథోడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, గంగుల కమలాకర్ సంతాపం తెలిపారు.