Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
కని పెంచిన పిల్లలు కళ్ళ ముందే కనుమరుగు అయినట్టు, ఇంటి దూలం ఇరిగి ఒక్కసారిగా భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలి వానకు తడిసి ముద్ద అయితే అన్నదాతకు ఎంత యాతనా, ఎంత కడుపు కోత? అని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే కనబడుతుందన్నారు. పోలీసు పహారా మధ్య, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు చేసే ఓ రేవంత్ రెడ్డి.. ఇకనైనా కళ్లు తెరవండి. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వండి. కొనుగోళ్ళు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయండి. దేశానికే అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడండి అని హరీశ్రావు సూచించారు.
కని పెంచిన పిల్లలు కళ్ళ ముందే
కనుమరుగు అయినట్టు,
ఇంటి దూలం ఇరిగి ఒక్కసారిగా
భుజం మీద పడ్డట్టు,
ఆరుగాలం శ్రమించి పండించిన పంట
గాలి వానకు తడిసి ముద్ద అయితే అన్నదాతకు ఎంత యాతనా,
ఎంత కడుపు కోత?రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా… pic.twitter.com/3j0VIX1ei1
— Harish Rao Thanneeru (@BRSHarish) May 14, 2025