Election Code | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో నగదు, బంగారం పెద్దఎత్తున పట్టుబడుతున్నది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను వెంట తీసుకవెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా నగదు, బంగారం తరలిస్తే తప్పనిసరి కేసులు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
చెక్కు, డీడీ, ఆర్టీజీఎస్, నిఫ్ట్, ఆన్లైన్ పద్ధతుల్లో డబ్బు అకౌంట్కు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్నా… నగదును ఎందుకు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఆధారాలను సమర్పించాల్సి ఉంటుం ది. బంగారు నగల రవాణా విషయంలోనూ ఇవే నిబంధనలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. 50 వేల నగదు రవాణాకు అనుమతులు ఉన్నాయని వివరిస్తున్నారు. దొరికిన నగదు, బంగారం తదితర వాటికి తగిన ఆధారాలు సమర్పించకపోతే వాటిని ఐటీ, జీఎస్టీ, ఈడీ తదితర శాఖల అధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేస్తారు.