హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారానికి ఇది తోడవడంతో తెలంగాణలో పచ్చదనం మరింత రెట్టింపు అవుతున్నదని పేర్కొన్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని సంజీవయ్య పార్కులో సీఎస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్తు తరాల బాగు కోసం, ప్రకృతి పట్ల అవగాహనతో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన మొకల యజ్ఞం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని కొనియాడారు. మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, తన పుట్టినరోజున మొక్కలు నాటే సదావకాశం కల్పించిన సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ హరితహారం, గ్రీన్ చాలెంజ్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.