కౌకుంట్ల, జులై 15: ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూర్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై వెంకటగిరి, వెంకంపల్లి, రేకులంపల్లి, పేరూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, బీఎల్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్హులైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు దగ్గరుండి నమోదు చేయించాలని తెలిపారు.