CM KCR | హైదరాబాద్ : ఇప్పుడు తెలంగాణలో ఆకలి కేకలు లేవు.. అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించింది. వరి ధాన్యం పండించడంలో పంజాబ్ను మించిపోయింది తెలంగాణ. ఈ క్రమంలో తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో ఆకలి కేకలు లేవు అని స్పష్టం చేశారు కేసీఆర్. హాస్టల్స్ పిల్లలతో పాటు అంగన్వాడీలో చదువుకునే పిల్లలకు కూడా సన్నబియ్యం అందిస్తున్నాం. అన్నపూర్ణగా తయారైన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు వచ్చే ఏప్రిల్, మే నుంచి సన్నబియ్యం ఇస్తాం. ఇక దొడ్డుబియ్యం బాధ ఉండదు. ఈ స్కీంకు తెలంగాణ అన్నపూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్రభుత్వంలోకి రాగానే ఇంప్లీమెంట్ చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.