నల్లగొండ, జనవరి 8 : ‘నేను బతికే ఉన్నా.. చనిపోలేదు.. నా పేరుతో తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలి’ అని ఓ రైతు నల్లగొండ కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊ ట్కూరుకు చెందిన నల్లగంటి శంకర్ అనే రైతు 2016లో శాలిగౌరారం ఎస్బీఐలో 40 వేల పంట రుణం తీసుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 50 వేల లోపు రుణాన్ని మొదటి విడతలో మా ఫీ చేసింది. శంకర్ పేరుమీద కూడా మాఫీ వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖ రికార్డుల్లో ఆయన చనిపోయినట్టు నమోదైంది. దాంతో ఆ మాఫీ డబ్బు వెనక్కి వెళ్లాయి. ఇటీవల రుణం కోసం అదే బ్యాంకుకు వెళ్లిన శంకర్కు అసలు విషయం తెలిసి విస్తుపోయాడు.