హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని తిరిగి భారత్కు రప్పించాలని విదేశీ వ్యవహారాలశాఖ ఉన్నతాధికారులకు ప్రవాస భారతీయుల హకులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెంట్ల మోసాలు, ఇతర కారణాలతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు తిరిగి స్వస్థలాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలా ఎంతోమంది జాడ తెలియకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఇందుకు తగిన చర్యలు తీసుకొంటామని మంత్రి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లి జాడ లేని వారి వివరాల జాబితాను మంత్రి కార్యాలయంలో అందజేసినట్టు కోటపాటి వివరించారు.
తప్పిపోయిన వారి వివరాలు