హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పణకు మరింత గడువు కోరింది. ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్రెడ్డి బుధవారం సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదించింది. విచారణలో భాగంగా కౌశిక్రెడ్డి వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ ఒకటో తేదీన కేఆర్ఎంబీ 21వ విడత సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ బుధవారం లేఖల ద్వారా సమాచారం పంపారు. ప్రతి నీటి సంవత్సరం జూన్1 నుంచి మే31 వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు ఏపీ, తెలంగాణ ఒప్పందాలు చేసుకోవాలి.