వాషింగ్టన్, మే 27: కరోనా మహమ్మారి మూలాలను కనుగొనే ప్రయత్నాలను ముమ్మరం చేసి, 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అమెరికా నిఘా సంస్థలను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుంచి కరోనా ప్రబలిందా లేక ప్రయోగశాల నుంచి పుట్టిందా అని నిర్ణయించడానికి తగినంతగా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ దర్యాప్తునకు సహాయం అందించాలని అమెరికా నేషనల్ ల్యాబొరేటరీస్ను ఆదేశించారు. కరోనా మూలాలను అన్వేషించే అంతర్జాతీయ దర్యాప్తులకు సహకరించాలని చైనాకు సూచించారు. పూర్థిస్థాయిలో పారదర్శకంగా సాగే ఈ దర్యాప్తుల్లో పాల్గొనాలని, సంబంధిత సమాచారం, ఆధారాలను అందించాలని చైనాపై మిగతా దేశాలతో కలిసి ఒత్తిడి తెస్తామని చెప్పారు.