మాదాపూర్, ఆగస్టు 28: శరీర ఆరోగ్యం మెరుగుపడటానికి యోగా ఎంతో అవసరమని ప్రముఖ యోగా గురు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద తెలిపారు. పంచదార, ఉప్పు, నూనె పదార్థాలను తిననని, అదే తాను 125 ఏండ్లు జీవించటానికి దోహదపడ్డాయని వెల్లడించారు. గత మూడు రోజులుగా మాదాపూర్లోని హైటెక్స్లో కొనసాగుతున్న స్పోర్ట్స్ ఎక్స్ పో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను 9 ఏండ్ల వయసులోనే యోగా చేయటం మొదలుపెట్టానని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ తన చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. తాను జీవిస్తున్న జీవన విధానమే ప్రజలకు తానిచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు.