హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీయాలేనని.. ఆరోపణలు తప్పయితే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బుధవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కౌశిక్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
గోతులు తవ్వే అలవాటు ఉన్న ఈటల నీతులు చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని, ఆయన రక్తచరిత్రను కేసీఆర్కు అంటించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈటలది రక్తచరిత్ర కనుకే అందరినీ అదే కోణంలో చూస్తారని.. ఆయన పైకి కనిపించేంత అమాయకుడు కాదని, చెప్పేదొకటి చేసేది మరోటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు ఈటలకు నకకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని, అన్నం పెట్టిన కేసీఆర్కు సున్నం పెట్టిన ఘనచరిత్ర ఆయనదని విమర్శించారు.
హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రమ్మంటే పారిపోయిండని, ఉపఎన్నికల్లో గెలిచి ఏడాదవుతున్నా నియోజకవర్గానికి లక్ష రూపాయలైనా తీసుకురాలేదని వివరించారు. గన్లైసెన్స్లు యథేచ్ఛగా ఇస్తున్నారన్న ఈటల వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. సానుభూతి రాజకీయాలు చేయడం ఈటలకు అలవాటేనని, ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. శాసనసభ నుంచి కావాలనే సస్పెండ్ అయ్యారని.. ఆయనకన్నా ముందే మా నాన్న కేసీఆర్తో కలిసి పనిచేశారని కౌశిక్రెడ్డి తెలిపారు.