జమ్మికుంట, డిసెంబర్ 5 : బాలికను వేధించిన ఘటనలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన బీజేపీ నాయకుడు కొమ్ము అశోక్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈయన ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ముఖ్యఅనుచరుడు కావడంతో జిల్లాలో కలకలం రేపింది. ఆబాది జమ్మికుంటకు చెందిన అశోక్.. ఓ వివాహితతో కలిసి బాలికను వేధించడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదైంది.