కమలాపూర్, ఫిబ్రవరి 5: బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్-పంగిడిపల్లి గ్రామాల మధ్య చోటుచేసుకున్నది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమలాపూర్ మండలం పంగిడిపల్లి నుంచి కమలాపూర్కు వెళ్తుండగా.. కమలాపూర్-పంగిడిపల్లి రోడ్డు ఎప్పుడు బాగుచేస్తారో ఎమ్మెల్యేను అడిగేందుకు పంగిడిపల్లికి చెందిన పది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఈ మేరకు హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ వద్ద ఈటల కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నించారు. ముందు వాహనాల్లో ఉన్న ఈటల అనుచరులు వచ్చి దాడికి పాల్పడటంతో బాస్పాటి వీరేశం, దృగ్నాల శ్యామ్, దృగ్నాల రాకేశ్, కౌడగాని ప్రవీణ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. వీరేశం ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఈటల అనుచరులపై కేసు నమోదు చేసినట్టు సీఐ సంజీవ్ తెలిపారు.