కమలాపూర్, 9: హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నోటీసులు అందుకున్న బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం వరంగల్ డీసీపీ కార్యాలయంలో హాజరు కానున్నారు. హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో ఇప్పటికే ఈటల పీఏలు డీసీపీ కార్యాలయంలో హాజరయిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ పోలీసుల విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో.. బీజేపీ శ్రేణులు డీసీపీ కార్యాలయానికి భారీగా తరలిరావాలని వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇస్తున్నారు. దీంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొన్నది.