నర్సాపూర్,నమస్తే తెలంగాణ ;నర్సాపూర్ నియోజకవర్గం ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నది. 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదన్రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆశీస్సులతో సునీతాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన ఆమె మహిళల హక్కులు, వారి సంక్షేమానికి కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఎన్నో సంక్షేమ, అభివృద్ధ్ది పనులను ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సునీతారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సుముఖతతో ఉన్నారు.
అభివృద్ధి కొత్తపుంతలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో 252 హెక్టార్లలో అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. నర్సాపూర్లో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మంజీరా, హల్దీ వాగులపై 11 చెక్డ్యాంలు నిర్మించి రైతుల సాగునీటి కష్టాలను తీర్చారు. మిషన్ కాకతీయ ద్వారా వందలాది చెరువులల్లో పూడిక తీశారు. దీంతో చెరువులల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల్లో నీరు పుష్కలంగా లభిస్తున్నది. వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరింది. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారుతున్నది. మిషన్ కాకతీయతో మత్స్యసంపద బాగా పెరిగింది. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
ఏరియల్ వ్యూ: నర్సాపూర్
నర్సాపూర్… ప్రకృతి అందాలకు నెలవు. దట్టమైన అటవీ ప్రాంతం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. అడవికే కొత్త అందాలను అద్దారు. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఇక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వారాంతంలో కిటకిటలాడుతున్నది.
ప్రజల చిరకాల కోరికైన బస్డిపోను నిర్మించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, గ్రంథాలయం, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేశారు. పేదల ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మించారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఫోర్లైన్ జాతీయ రహదారి నిర్మించారు. నియోజకవర్గంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు, రైతుబీమాను అందజేస్తున్నారు.
మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలో 248 వాటర్ ట్యాంకులను నిర్మించారు. 800 కిలోమీటర్ల దూరం పైప్లైన్ వేశారు. ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామగ్రామాన వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లెప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించారు. ప్రతి గిరిజన తండాకు సీసీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు.