హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా తగ్గినప్పటికీ పోలీసులు మాత్రం రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ఇటీవల కొత్త చెక్పోస్టులను ఏర్పాటుచేశారు. చెన్నాపురం, కూసుగుబ్బ, వింజంపల్లిలోనూ నూతన ఔట్పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. అవసరం మేరకు మరికొన్ని కొత్త ఔట్పోస్టులను అమల్లోకి తెచ్చేలా స్ట్రాటజిక్ ప్లాన్తో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు.