munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికపై నిత్యావసరాల ధరలు తీవ్ర ప్రభావం చూపినట్లు టీఆర్ఎస్ నాయకులు నారదాసు లక్ష్మణరావు పేర్కొన్నారు. ఉప ఎన్నిక ఫలితాలపై టీ న్యూస్ వేదికగా నిర్వహించిన విశ్లేషణలో నారదాసు లక్ష్మణరావు ఈ విషయాలను వెల్లడించారు. ప్రధాని మోదీకి మహిళలు తగిన బుద్ది చెప్పారు. ప్రధానంగా గ్యాస్ ధరలు రూ. 400 నుంచి రూ. 1200కు పెరిగింది. అంతే కాకుండా పెట్రోల్, డిజీల్ ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ధరలు పెరిగిపోయాయి. దీంతో మహిళ ఓటర్లు తీవ్ర ఆగ్రహాంగా ఉన్నారు.
నేతన్నలు కూడా కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు. చేనేతపై జీఎస్టీ విధించడంతో నేతన్నలు బీజేపీకి బుద్ధి చెప్పారు. ధరల పెంపు బీజేపీపై వ్యతిరేకత చూపింది. మహిళలు, యువకులతో పాటు ఏ వర్గానికి కూడా బీజేపీ మేలు చేయలేదు. ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రతి వర్గాన్ని ఆదుకుంది. అన్ని వర్గాలకు ఉపాధి చూపించారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది. సంక్షేమం ప్రతి గడపకు చేరింది. రైతుబంధు, రైతుబీమా పథకాలను రైతుల గుండెల్లో నిలిచిపోయాయి. ఫ్లోరైడ్ బాధితులంతా టీఆర్ఎస్కు ఓటేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు అందించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనకే మునుగోడు ప్రజలు జైకొట్టారని నారదాసు లక్ష్మణరావు పేర్కొన్నారు.