హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): నాచారం ఈఎస్ఐ దవాఖానలో అన్నివసతులు కల్పించి వచ్చేనెల 31లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఈఎస్ఐ బోర్డు తీర్మానించిం ది. సోమవారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన ఈఎస్ఐసీ 8వ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగిం ది. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈఎస్ఐ దవా ఖానలు, డిస్పెన్సరీల్లో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఈఎస్ఐ బోర్డు సభ్యులు రాష్ట్రంలోని అన్ని డిస్పెన్సరీలను సందర్శించి, మందుల కొరత ఉన్నా, డాక్టర్లు, సిబ్బంది నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా ఉంటే తమ దృష్టి కి తీసుకరావాలని సూచించారు. ఎమర్జెన్సీ కేసులను ఎంప్యానల్ చేసుకున్న హాస్పిటళ్లకు రిఫర్చేసే అధికారం ఎంఎస్లకు ఉన్నందున, రోగుల క్షేమం కోసం ఎమర్జెన్సీ రోగులను ఆయా సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు పంపించాలని మంత్రి సూచించారు. జిల్లాస్థాయి ఈఎస్ఐ కమిటీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. సమావేశంలో ఈఎస్ఐ రీజినల్ డైరెక్టర్ రేణుకాప్రసాద్, స్టేట్ మెడికల్ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు.