రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) న్యాక్ బృందం ప్రత్యేక బుధవారం కమిటీ సందర్శించింది. కాగా కళాశాలకు న్యాక్ హోదా ముగియడంతో దరఖాస్తు సమర్పించడంతో ఫిబ్రవరి 4, 5 నాలుగురు సభ్యులతో కూడి న బృందం వచ్చి తనిఖీ చేశారు. అయితే రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఫలితం(గుర్తింపు) ఇవ్వలేదు. తిరిగి గుర్తుంపు ఇచ్చే క్రమంలో ప్రత్యేక పరిశీలనకు మళ్లీ బుధ, గురువారంలో తనిఖీకి వచ్చిన నూతన బృందం సభ్యుల కు ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్, అధ్యాపక బృందం సభ్యులు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
అదేవిధంగా ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటర్లు, క్యాడెట్స్, పీవోలు, ఆఫీసర్లు స్వాగతించారు. జనవరి 26, 2021న గణతంత్ర దినోత్సవ పరేడ్లో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పరేడ్లో కంటిజెంట్ లీడర్గా పాల్గొని వచ్చిన కళాశాల అధ్యాపకుడు ఈ.యాద గిరిరెడ్డి ఎన్ఎస్ఎస్ పనితీరును వివరించడంతో ఆయనకు న్యాక్ టీం అభినంద నలు తెలిపింది. ఇదే క్రమంలో ఎన్సీసీ పురుషుల, మహిళాల గౌరవ వందనం స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలుత ప్రిన్సిపాల్ ఛాంబర్లో ప్రిన్సిపాల్ కళాశాల చరిత్ర, అభివృద్ధి, కోర్సు లు ఇతర వివరాలను పవర్పాయింట్ ప్రజంటే షన్తో వివరించారు. కళాశాలలో వివిధ విభాగాల హెచ్వోడీలతో సమావేశ మై వివరాలు, అభిప్రాయాలను సేకరించారు. తర్వత డిపార్టుమెంట్స్, పరీక్షల విభాగంకు వెళ్లి అమలు చేస్తున్న కోర్సు లు, విద్యార్థులు, అధ్యాపకుల పనితీరు వసతులు పరిశీలించారు.
గ్రంథాలయాన్ని సందర్శించిన వారు అందులో 59,211 పుస్తకాలుండటం, విద్యార్థులకు డిజిటల్ విధానంలో అందిస్తు న్న వసతులు..పలు అంశాలను నిర్వహిస్తుండటం, ఇ-మొబైల్ లైబ్రరీ తెలంగాణ యాప్ నిర్వహణ, ఎన్డీఎల్ఐ (నేషన ల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ సైతం చూసి గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు ఎ.దుర్గప్రసాద్ కృషి, సేవలను అభినందించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ పీడీ కడారి మల్లేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులలు ఇండోర్ క్రీడలు, యోగ, జిమ్ సెంటర్(పురుషులు, స్త్రీలు) అంశాలు విద్యార్థులు క్రీడల్లో సాధించిన ప్రతిభ ఇతర అంశాలను పరిశీలన చేశారు.
అదే విధంగా సాయంత్రం నిర్వహించిన అలూమిని(పూర్వ విద్యార్థుల)సమావేశానికి ఎన్జీ పూర్వ విద్యార్థి ప్రస్తుత జేఎన్టీ యూ హైద్రాబాద్ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి, పూర్వ విద్యార్థులు మాజీ ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. నరేందర్రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీ గోనారెడ్డితో పాటు చాలా మంది అలూమిని సభ్యులు హాజరయ్యారు. వారితో చర్చించి అలూమినీ ఆధ్వ ర్యంలో కళాశాలకు అందించే కృషి, సహాయ సహకారలను తెలుసుకుని నమోదు చేసుకున్నారు.
వివరాలు అందించడంలో తడబడ్డ అధ్యాపకులు..
న్యాక్ పీర్ టీంలోని చైర్మన్, వీసీ కన్నూర్ యూనివర్సిటీ కేరళ, ప్రొ. గోపీనాథ్ రవీంద్రన్, మెంబర్ కోఆర్డినేటర్ జమ్ముకాశ్మీర్ సెంట్రర్ యూనివర్సిటీ ప్రొ. మహ్మద్ అఫ్జల్ జర్ గార్, మెంబర్ సుగుణ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తమిళనాడు ప్రిన్సిపాల్ ప్రొ. ఆర్.కితప్పవైద్యనాథన్, పరిశీలకుడు పూర్వ యూజీసీ మెంబర్, ప్రొ. జి.గోపాల్రెడ్డిలు పలు విభాగాల తనిఖీ, పరిశీలనకు వెళ్లిన సందర్భంలో అధ్యాపకులు వారికి సమాధానం చెప్పడంలో తడబడ్డారు. దీంతో కళాశాలకు ప్రస్తుతం (గతంలో) ఉన్న న్యాక్ గ్రేడ్ -ఎ గుర్తింపు వస్తుందా…? గుర్తింపు హోదా పెరుగుతుందా…? పాత హోదానే దక్కుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
గురువారం సైతం పరిశీలన
తొలి రోజూ చూసిన అంశాలను పరిశీలన చేసిన బృందం రెండో రోజు గురువారం సైతం కళాశాలలో పర్యటన చేయనుంది. ఈ సందర్భంగా పూర్తి వివరాలతో కూడిన రిపోర్టు తయారు చేస్తారు. దానిని ప్రత్యేక కవర్లో ఉంచి సీల్ చేస్తారు.