హైదారాబాద్ : పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్రీతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే ప్రీతి తల్లిదండ్రులు శారద, ధరావత్ నరేందర్ నాయక్తో మాట్లాడారు. జరిగిన పరిస్థితులను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి పర్యటన కారణంగా దయాకర్ రావు రాలేకపోయారని ఆమె తెలిపారు అందుకే తాను ప్రత్యేకంగా వచ్చినట్లు చెప్పారు.