హనుమకొండ : వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం హన్మకొండలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో నైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నయా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫక్కీరు వేషాలు మానుకోవాలని హితవు పలికారు. తొండి సంజయ్ మాటలకు విలువ లేదన్నారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం.
సీఎం కేసీఆర్ కు కనీసం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.
అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులు స్పష్టతను ఇవ్వడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతకైనా సిద్ధంఉందన్నారు.
తెలంగాణ పట్ల కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. ఢిల్లీ మెడలు వంచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాలన్నారు. తెలంగాణలో రైతులు వానాకాలంలో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. రైతులు సంయమనం పాటించాలన్నారు. అలాగే భవిష్యత్తులో వానాకాలం, యాసంగిలో ఎంత పంటను తీసుకుంటారో కేంద్రం ముందే ప్రకటించాలి.
దీనివల్ల రాష్ట్రంలో ఏ పంట వేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి,పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మరావు ఉన్నారు.