హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీచేశారు. ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు. గతంలో ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.