అసోంకు చెందిన పద్మశ్రీ డాక్టర్ రవికన్నన్ ఇండియన్ హీరో అని ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. డాక్టర్ రవికన్నన్ ఓ పడవను తనిఖీ చేస్తున్న ఫొటోను గురువారం ఆయన ట్వీట్ చేశారు. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ రవికన్నన్ అని, ఆయన అసోంలోని పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని ఎరిక్ సోల్హెమ్ పేర్కొన్నారు.
డాక్టర్ రవికన్నన్ అసోం వరదల్లోనూ క్యాన్సర్ రోగులకు చికిత్స చేసేందుకు పడవపై వారి వద్దకు వెళ్తున్నారు. సిల్చార్లోని కాచర్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట వరదలో పడవపై కనిపించారు. ఈ ఫొటోను ఎరిక్ సోల్హెమ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ట్వీట్ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి రీట్వీట్ చేశారు. ‘రవికన్నన్ను గౌరవించాలి’ అని క్యాప్షన్ ఇచ్చారు.
#Respect 🙏 https://t.co/y0BKfJ2piS
— KTR (@KTRTRS) July 7, 2022