హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హకులు దకాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలిపారు. మహిళా సాధికారిత, ఆర్థిక స్వాలంబన కోసం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని వెల్లడించారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాదేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.