హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సమాజ అభ్యున్నతిలో ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పలువురు అభిప్రాయపడ్డారు. దివంగత ఇంజినీర్ నవాబ్అలీ జంగ్ బహదూర్ 73వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జలసౌధలో తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవవాన్ని నిర్వహించారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్రావు, అనిల్కుమార్ తదితరులు నవాజ్అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే నిరుడు డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు మరణించిన 71 మంది ఇంజినీర్ల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ సాగునీటిరంగ నిపుణుడు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఆర్ విద్యాసాగర్రావు సేవలను స్మరించుకొన్నారు. అనంతరం వీ ప్రకాశ్ మాట్లాడుతూ అలీ నవాజ్జంగ్ గృహాన్ని ఇంజినీర్ల స్మారక ప్రదేశంగా అభివృద్ధి పర్చాలన్నారు.
ఈఎన్సీ అనిల్కుమార్ మాట్లాడుతూ ఇంజినీర్లకు అన్ని అలవెన్సులను సకాలంలో అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశామని చెప్పారు. విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ ప్రభావంతో 161 మంది, ఇతర కారణాలతో 71 మంది ఇంజినీర్లు మృతి చెందారని పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ఇంజినీర్లలో తనకు సన్నిహితుడైన నిజాం వెంకటేశంతో పాటు చాలామంది మిత్రులు ఉన్నారని సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే గుర్తు చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షుడు చంద్రమౌళి, ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం, రమణానాయక్, రమాదేవి పాల్గొన్నారు.