హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విసృ్తతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్ లోడింగ్ వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు.
సూల్ బస్సులు, మినీ వ్యాన్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, అనుమతించిన సా మర్థ్యానికి మించి విద్యార్థులను తరలించే వాహనాలను సీజ్ చేయడంతోపాటు ఆ యా విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని, స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశా రు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్, జేటీసీ చంద్రశేఖర్గౌడ్, డీటీసీ రవీందర్ కుమార్, వెంకట రమణ, సురేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.