Agrigold Case | అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కంపెనీ ప్రమోటర్లయిన ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లను ఛార్జిషీట్లో పేర్కొంది. అలాగే అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయగా.. నాంపల్లి ఎంఎస్జే కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కోర్టు అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 3న కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. ఇదిలా ఉండగా.. 32లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్పై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.4,141 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేసింది.